Akhanda Sequel | Akhanda 2

 అఖండ సినిమాకు సీక్వెల్

Akhanda2-akhanda-sequel-balakrishna-boyapatisrinu
Balakrishna 




Akhanda Sequel :-

         నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ఇప్పుడు టాలీవుడ్లో ఈ కాంబినేషన్ గురించి చర్చ జరుగుతోంది. ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య ప్రతిసారి బోయపాటి తోనే సక్సెస్ బాట ఎక్కుతున్నాడు. సింహా సినిమా కి ముందు బాలయ్య ప్లాపులతో సతమతం అయ్యాడు. మళ్లీ లెజెండ్ సినిమా కు ముందు కూడా బాలయ్యను ఫ్లాపులు పలకరించాయి. ఇప్పుడు అఖండ సినిమాకు ముందు  ఇక పూర్తిగా బాలయ్య మార్కెట్ పడిపోయిందని పెద్దఎత్తున ప్రచారం అయితే జరిగింది. 


         ఇప్పుడు అఖండ తో లాభాలు తింటున్న నిర్మాత దిల్ రాజు కూడా మొదట అఖండ సినిమాకి నేను బాలయ్యను నమ్మి 50 కోట్లకు పైగా ఖర్చు పెట్టలేను అని అన్నారు. ఆ తర్వాత దర్శకుడు మిరియాల రవీందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు. ఈ విధంగా నిర్మాతలు కొన్ని సందర్భాలలో బాలయ్య పేరు చెప్తే భయపడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు అఖండ తో టాలీవుడ్ హిస్టరీ లోనే నిలిచిపోయే సక్సెస్  అందుకున్నారు బాలయ్య బోయపాటి.


          ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ వారు బాలయ్య బోయపాటి కాంబినేషన్ మళ్లీ రిపీట్ చేయాలని ఆలోచిస్తున్నారట. అది అఖండ 2 అయితేనే ఈ సినిమాకి మరింత క్రేజ్ వస్తుందని అనుకుంటున్నారట. సినిమాలో అఘోర బాలకృష్ణ గారు అందరినీ వదిలి వెళ్లే సమయంలో చిన్ని పాపకు మాట ఇవ్వడం జరుగుతుంది. నీకు భవిష్యత్తులో ఏ కష్టాలు ఎదురైనా నేను తిరిగి వస్తా అంటారు. 


           ఇప్పుడు సినిమాను అక్కడి నుండి స్టార్ట్ చేయాలని బోయపాటి గారితో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు మంతనాలు జరిపారట. అఘోర బాలకృష్ణ పసికందుగా ఉన్నప్పుడే కాశీ చేరాడు. అక్కడ అఘోరాల తో జరిగిన సన్నివేశాలు కూడా సీక్వెల్ లో చూపిస్తారని తెలుస్తోంది. మొత్తానికి అయితే అఖండ సీక్వెల్ సినిమా పై భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు సిద్ధం అయ్యారు. 2023 లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని తెలుస్తోంది.



Post a Comment

0 Comments